ఇంతకాలం నమ్మినబంటుగా ఉండి తిరుగుబాటుతో వెన్నుపోటు పొడిచిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం మాత్రం సీఎం కుర్చీలో కూర్చోరాదనీ, మీలో ఎవరైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టండంటూ గోల్డెన్ బే రిసార్ట్స్లో తనతో ఉన్న శాసనసభ్యులతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ స్పష్టంచేశారు.
అయితే గవర్నర్ బల పరీక్షకు అవకాశం ఇస్తే తమిళనాడు అసెంబ్లీలో బలాబలాలను ఆధారంగా చేసుకుని తదుపరి సీఎం ఎవరనేది తేలనుంది. తాను సీఎం కాకపోయినా ఫర్వాలేదు కానీ, పన్నీర్ సెల్వం కాకూడదనే ఉద్దేశంతో శశికళ ఇదంతా చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి.