ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి ఉమాభారతి కాస్తంత కఠువుగానే స్పందించారు. విద్యావంతుడైన అఖిలేశ్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయినా తాగునీరు, ఆహారం వంటి వాటిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. వచ్చే ఏడాది యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే అఖిలేశ్, ఆ తర్వాత ఉమాభారతి ఈ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.