అస్సోంపై దాడికి అల్‌ఖైదా కుట్ర : తరుణ్ గగోయ్

ఆదివారం, 21 సెప్టెంబరు 2014 (12:57 IST)
ఈశాన్య రాష్ట్రమైన అస్సోంపై దాడికి అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా కుట్రపన్నిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ చెప్పారు. అలాగే, అస్సాం భూభాగంలోకి చొరబడేందుకు అల్ ఖైదా ప్రయత్నిస్తోందన్నారు. అంతేగాక ఆ టెర్రర్ గ్రూపు రాష్ట్రంలో స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు, ఉల్ఫా (యూఎల్ఎఫ్ఏ)తో రహస్య ఒప్పందం కూడా చేసుకుందని మీడియా ముఖంగా ప్రకటించారు. 
 
ఈ మేరకు తమకు పక్కా సమాచారం ఉందన్నారు. ఈ క్రమంలో వారి చొరబాటును నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, సంబంధిత జాగ్రత్తలన్నీ తీసుకుంటామని తెలిపారు. ఇటీవల భారత్‌లో అల్ ఖైదా తన శాఖను ప్రారంభించడం, అటు భారత్‌లో ఆ సంస్థ విఫలమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి