మహరాష్ట్ర గవర్నర్ అయిన ఆయన తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్గా ఉన్నారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్థానంలో జయలలిత నెచ్చెలి వీకే శశికళను ఎన్నుకుంటూ ఏఐఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజు ఢిల్లీ వెళ్లిన గవర్నర్ అక్కడి నుంచి నేరుగా ముంబైకి చేరుకున్నారు. శశికళ ప్రమాణ స్వీకారం గవర్నర్ చేతిలో ఉండటంతో ఆయన ఎప్పుడు చెన్నై వస్తారా ఎదురు చూస్తుండగా.. గవర్నర్ మాత్రం బుధవారం తమిళనాడు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
చెన్నై ఎప్పుడు వస్తారన్న దానిపై బుధవారం సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం ప్రస్తుత ముఖ్యమంతి శశికళపై తిరుగుబావుటా ఎగురవేయడంతో చెన్నైలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడిక్కిన సంగతి తెలిసిందే. దీంతో గవర్నర్ శశికళ ప్రమాణ స్వీకారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.