దేశంలో భాజపాకు పట్టులేని రాష్ట్రాల్లో మరింత పుంజుకునేందుకు భాజపా అధ్యక్షుడు అమిత్ షా ప్రణాళికులు రచిస్తున్నారు. ఇందులోభాగంగా పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను, ఇంచార్జిలను మారుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అధ్యక్షుడుగా కొత్తగా మనోజ్ తివారీని ఎంపిక చేశారు. సతీష్ ఉపాధ్యాయ్ స్థానంలో ఈయనను కూర్చోబెడుతున్నారు.