సామాజిక మాధ్యమాల్లోనూ హుషారుగా... ట్విట్టర్‌లో కలాం చివరి ట్వీట్స్..

మంగళవారం, 28 జులై 2015 (10:01 IST)
శాస్త్రవేత్తగా ఎదిగి, రాష్ట్రపతిగా దేశానికి సేవ చేసిన ఏపీజే అబ్దుల్ కలాం మారుతున్న కాలానికగుణంగా మారుతూనే వచ్చారు. అంతేకాక శాస్త్ర, సాంకేతిక రంగాలకు కొత్త జవసత్వాలను నింపిన కలాం సామాజిక మాధ్యమాల్లోనూ హుషారుగానే ఉన్నారు. 
 
కీలక సందర్భాలతో పాటు, తన కార్యక్రమాలపై ఆయన నిత్యం తన ట్విట్టర్ అకౌంట్ ను అప్ డేట్ చేసేవారు. సోమవారం షిల్లాంగ్ వెళుతున్న సందర్భాన్ని కూడా ఆయన తన ట్విట్టర్‌లో ప్రస్తావించారు. నివాసయోగ్యమైన గ్రహం భూమి... అనే అంశంపై మాట్లాడేందుకు షిల్లాంగ్ వెళుతున్నాను. శ్రీజన్ పాల్ సింగ్, శర్మ కూడా వస్తున్నారు.. అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇదే తన చివరి ట్వీట్ అవుతుందని ఆయనకు తెలయదు కాబోలు.

వెబ్దునియా పై చదవండి