ఈ జగత్తు ఉన్నంతకాలం మహిళలపై అత్యాచారాలు, అరాచకాలు జరుగుతూనే ఉంటాయని వెస్ట్ బెంగాల్ అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్ వ్యాఖ్యానించారు. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి.
గతంలో ఆ పార్టీకి చెందిన ఎంపీ తపస్ పాల్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చిక్కుల్లో పడ్డారు. ఈయనగారు.. సీపీఎం కార్యకర్తలు, నేతలు తమ పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్నట్టయితే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో మీ (సీపీఎం) మహిళలను అత్యాచారం చేయిస్తానంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెల్సిందే.