దేశం శోకసముద్రంలో ఉంటే అమ్మాయిలతో చిందులేసిన అస్సోం సీఎం!

శుక్రవారం, 31 జులై 2015 (18:26 IST)
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం హఠాన్మరణంతో దేశం యావత్తు విషాదంలో మునిగిపోతే.. అస్సోం రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ మాత్రం అమ్మాయిలతో డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ విషయాన్ని బీజేపీకి చెందిన ఎంపీ రమేష్ బిధూరి శుక్రవారం లోక్‌సభలో ప్రస్తావించారు.
 
 
బుధవారం అసోంలోని గోలాఘాట్ జిల్లాలో ఓ వేడుకలో పాల్గొన్న గొగోయ్ స్థానిక గిరిజన యువతులతో డ్యాన్స్ చేశారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అటుపై గొగోయ్ క్షమాపణలు కూడా చెప్పిన విషయం తెల్సిందే. ఈ అంశాన్ని బీజేపీ ఎంపీ లోక్‌సభలో ప్రస్తావించారు. 
 
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతితో దేశమంతా విషాదంలో మునిగిపోతే, అసోం సీఎం మాత్రం అమ్మాయిలతో చిందులేశారని దుయ్యబట్టారు. దేశం ఓ మహోన్నతుడిని కోల్పోయి విలపిస్తుంటే, ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అమ్మాయిలతో డ్యాన్సులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. దీనికి పలువురు బీజేపీ ఎంపీలు సైతం వంతపాటపాడారు. 

వెబ్దునియా పై చదవండి