అక్రమాస్తుల కేసులో జయలలిత జైలు పాలైనప్పటి నుంచి అన్నాడీఎంకే శ్రేణులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యులు షెల్వి మాట్లాడుతూ ప్రస్తుతం జయ జాతకంలో గురుస్థానం బలహీనంగా ఉందని, ఆ కారణంగానే ఆమె పదవులు కోల్పోయి, జైలు పాలయ్యారన్నారు.
జయ విడుదల కావాలంటే, అన్నాడీఎంకే శ్రేణులు యాగాలు చేయడం మానేసి త్యాగాలు చేయాలన్నారు. అంటే పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి మంత్రుల వరకు అంతా శుచీశుభ్రతను పాటిస్తూ, మాంసాహారానికి దూరంగా ఉండాలని వివరించారు.
కనుక అన్నాడీఎంకే శ్రేణులు గోదానం, రక్తదానం, అవయవదానం వంటి చేయాలని, శుచి శుభ్రతలు పాటించాలని సూచించారు. మొత్తానికి అన్నాడీఎంకే శ్రేణులు యాగాలకంటే త్యాగాలు చేస్తేనే ఆమెకు మంచి జరుగుతుందని స్పష్టం చేశారు.