ఇండియాలో మ్యాగీ నూడుల్స్ పని అయిపోయింది. ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయిల సరుకు ధ్వంసం చేశారు. ప్రస్తుతం నాన్వెజ్లో కేఎఫ్సీ వంతు వచ్చేసింది. దాని శాంపిల్స్ తీసిన అధికారులు సురక్షితం కాదని తేల్చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసిన శాంపిల్స్ను పరీక్షలకు పంపి నివేదికలు సిద్ధం చేశారు.
కేఎఫ్సీ చికెన్ సురక్షితం కాదని పరీక్షల్లో వెల్లడైనట్లు తెలిసింది. కేఎఫ్సీ చికెన్పై ఇటీవల ఆరోపణలు రావడంతో ఆహార భద్రతా చట్టం కింద తెలంగాణ ప్రభుత్వం 15 శాంపుళ్లను సేకరించి పరీక్షలు చేయించింది. మరోవైపు, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మున్సిపల్ చట్టం కింద 28 శాంపుళ్లను సేకరించి పరీక్షించారు.