చిరంజీవి బంగ్లాకు వాస్తు బాగోలేదట. ఇదేంటి అనుకుంటున్నారా? కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తాత్కాలిక ఊరట లభించినట్లు తెలుస్తోంది. 17, అక్బర్ రోడ్డులోని చిరంజీవి బంగ్లాను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కేటాయించిన సంగతి తెలిసిందే.
ఈ బంగ్లాను చిరంజీవి ఖాళీ చేస్తే.. అందులోకి రాజ్నాథ్ సింగ్ వెళ్లాల్సి ఉంది. ఈ బంగ్లాను చిరు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నట్లు తెలిసింది. అయితే ఇలా తీర్చిదిద్దిన బంగ్లాను రాజ్నాథ్కు కేటాయించారు. కానీ, ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ ఈ బంగ్లాలోకి ఇప్పటికిప్పుడే మారేందుకు ఆసక్తి చూపట్లేదట. అందుకు వాస్తు కారణమని చెబుతున్నారు.
యూపీఏ హయాంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవికి 2012లో 17, అక్బర్ రోడ్డులో టైప్ 8 బంగ్లాను కేటాయించారు. ఇప్పుడు ఆయన మాజీ మంత్రి కావడంతో.. తాను రాజ్యసభ సభ్యుడిని అయినందున తనకు అర్హమైన మరో బంగ్లాను చూపించాలని చిరంజీవి సంబంధిత శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు లేఖ కూడా రాశారు.