ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్)కు కర్ణాటక రాజధాని బెంగళూరులో రిక్రూటర్ ఉన్నాడంటూ బ్రిటన్ టెలివిజన్ సంస్థ ‘చానెల్ 4 న్యూస్’ గురువారం ప్రసారం చేసిన కథనం దేశంలో సంచలనం రేపుతోంది. బెంగళూరు కేంద్రంగా ‘మెహిదీ మెహబూబ్ బిశ్వాస్’ అనే మారు పేరుతో ట్విట్టర్లో "@ShamiWitness' పేరిట ఖాతా ద్వారా ఆ వ్యక్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చానెల్ 4 పేర్కొంది.
అయితే, ప్రస్తుతం మూతపడిన సదరు ఖాతా ఐఎస్ ప్రచార యుద్ధంలో కీలకపాత్ర పోషించిందని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. కాగా, పాకిస్థాన్ పోలీసులు తొలిసారిగా అల్ఖైదా ఉగ్రవాద సంస్థ భారత విభాగం ‘అల్ఖైదా ఇండియా (ఏక్యూఐ) సభ్యులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు అగ్రశ్రేణి కమాండర్ కూడా ఉండటం గమనార్హం.