మహిళలపై ఎక్కడపడితే అక్కడ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ఘటన మరువక మునుపే మహిళలపై అలాంటి దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దీంతో సభ్య సమాజంలో మహిళలకు ఆనందం, సంతోషం లేదు ఎప్పుడూ భయంతోనే గడుపుతున్నారు.
ఒంటరిగా వెళ్ళాలంటేనే జడుసుకుంటున్నారు. తాజాగా బెంగళూరు నగర శివారులోని నెలమంగలలో 25ఏళ్ల వివాహితపై గ్యాంగ్రేప్కు పాల్పడిన దుండగులు దారుణ హత్య చేశారు. మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం దారుణం వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల వయస్సు కల్గిన యువతి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. కాలికి మెట్టెలు ఉండటంతో ఆమెను వివాహితగా భావిస్తున్నారు.