తనపై దాడి జరుగుతుంటే చూస్తుండిపోయిన పోలీసులు ఆపై పరుగులు లంకించుకున్నారని టాంజానియా విద్యార్థిని చెప్పుకొచ్చింది. బెంగళూరులో చదువుకుంటున్న టాంజానియా విద్యార్థినిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గత ఆదివారం రాత్రి ఓ విదేశీయుడి కారు ఢీకొని బెంగళూరులో ఓ మహిళ మృతి చెందింది. అదే సమయంలో అటుగా వచ్చిన టాంజానియా విద్యార్థిపై బెంగళూరు వాసులు విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా ఆ యువతిని చితకబాదిన కన్నడిగులు, ఆమెను వివస్త్రను చేసి నడిరోడ్డుపై పరుగులు తీయించారు. ఈ వ్యవహారంపై టాంజానియా ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. కాపాడమంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లగా, అక్కడి పోలీసులు కూడా స్పందించలేదన్న వార్తలతో ఈ వివాదం ముదిరింది.
కారు ప్రమాదంలో 35ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయిందని, తనపై దాడి జరగడంతో పాటు వివస్త్రను చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వారు ఏమాత్రం లెక్కచేయలేదని టాంజానియా విద్యార్థిని చెప్పుకొచ్చింది. కాగా ఢిల్లీలోని టాంజానియా రాయబార కేంద్రం.. ఈ ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను చేతికందుకుంది. ఇక బెంగళూరు సిటీ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.