ఈ బాత్రా ఎవరు..?
రిటైర్డ్ టీచర్, బీజేపీ సిద్ధాంతకర్త, స్వయం సేవక్ అయిన బాత్రా మొన్న ఫిబ్రవరి నుంచి వెలుగులోకి వచ్చారు. ఆయన హిస్టారియన్, ప్రముఖ రచయిత వెండీ డోనిజెర్స్ రాసిన 'ద హిందూస్-యన్ ఆల్టర్నేటివ్ హిస్టరీ' అన్న పుస్తకంపై కేసు వేసి గుర్తింపు పొందారు. ఆయన వేసిన దావాతో ఈ గ్రంథం ప్రచురణ కర్తలైన పెంగ్విన్ ఇండియా ఈ పుస్తకాలన్నింటినీ వెనక్కుతీసుకోవాల్సి వచ్చింది. పుస్తకాలను నాశనం చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం బహిర్గతంగా ఆర్థిక సంస్కరణలను, అంతర్గతంగా మత సంస్కరణలను ఆమలు చేస్తోందా ఆన్న అనుమానాలు తలెత్తుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.