మైక్రోబయాలజీ విద్యార్థిపై గ్యాంగ్ రేప్... కామాంధుల కోసం గాలింపు

గురువారం, 25 ఆగస్టు 2016 (09:34 IST)
సాధారణంగా ఆడవాళ్లపై మగవాళ్లు అత్యాచారం చేస్తుంటారు.. ఇలాంటి ఘటనలు చాలానే వింటుంటాం. అయితే ఇక్కడ ఒక యువకుడిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. వారణాసిలోని ప్రసిద్ధ బెనారస్ హిందూ యూనివర్శిటీలో ఎం.ఏ హిందీ ప్రథమ సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థి రెండు వారాల క్రితం యూనివర్శిటీలోని మైక్రోబయాలజీ డిపార్టుమెంటుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఐదుగురు కామాంధులు అతడిని అడ్డగించి కారులో ఎక్కించుకున్నారు. 
 
మద్యం మత్తులో ఉన్న ఆ కామాంధులు ఆ విద్యార్థిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి యూనీవర్శిటీ క్యాంపస్ వెనక ఉన్న ఓ పొలంలో పడేసి అక్కడి నుండి పారిపోయారు. ఆ విద్యార్థి కొద్దిసేపటికి తేరుకుని పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు లైంగిక దాడి జరిగింది నిజమే అని ధృవీకరించారు. కాగా, ఆ ఐదుగురు కామాంధులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి