కొంతమందికి ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డారని వారు చెప్తున్నారు. మధుబని నుంచి సీతామర్హి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని.. చెరువులో పడ్డ బస్సును బయటకు తీసేందుకు స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.
ఇకపోతే.. ఈ బస్సు ప్రమాదంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతులకు సంతాపం ప్రకటించిన సీఎం వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు.