బీజేపీపై లాలూ ప్రసాద్ ధ్వజం.. అదో అమెరికన్ పార్టీ!

గురువారం, 29 జనవరి 2015 (14:37 IST)
భారతీయ జనతా పార్టీపై కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రవస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీని ఒక అమెరికా పార్టీతో పోల్చారు. భారత్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన ముగిసిన మరుక్షణమే, ఆయన బీజేపీపై విరుచుకుపడటం గమనార్హం.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు, ఒబామాకు ఏ స్థాయిలో రాచమర్యాదలు చేసిందో చూశారుగా!. బీజేపీని అమెరికాకు చెందిన పార్టీ అని చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శనమేం కావాలి. ఇదే విషయాన్ని నేను చాలా కాలం నుంచి చెబుతూనే ఉన్నాను అని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పుకొచ్చారు. 
 
సిరి ఫోర్ట్ పై నుంచి ఒబామా చేసిన ప్రసంగాన్ని సైతం ప్రస్తావించిన లాలూ, తనదైన రీతిలో బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో బీజేపీపై విమర్శలు సంధించేందుకు ప్రతి విషయాన్ని ఆయన తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి