గత 2013 డిసెంబరు నెలలో సిట్టింగ్ భాజపా ఎమ్మెల్యే రాజేంద్ర సింహ్ చావడా నిర్లక్ష్యంగా కారు నడిపి... అజయ్ పటేల్ అనే వ్యక్తిని ఢీకొట్టించారు. చావడా మద్యం సేవించి, అత్యంత వేగంతో చాలా నిర్లక్ష్యంగా కారు నడిపారని అజయ్ పటేల్ తన ఫిర్యాదలో పేర్కొన్నాడు. పైగా ఈ ప్రమాదంలో పటేల్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో మోటార్ వాహనాల చట్టం కింద చావడాపై కేసు నమోదు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. చావడాను దోషిగా నిర్ధారించి, మూడు నెలల జైలుశిక్షతో పాటు.. రూ.2600 అపరాధం విధించింది. అయితే, ఎమ్మెల్యే అదే కోర్టులో రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు చావడాకు బెయిల్ మంజూరు చేసింది. కాగా, చావడా 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది 2014లో భాజపాలో చేరారు.