భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కఠినమైన నియమ నిబంధనలు పెట్టారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు బీజేపీ సభ్యులు విదేశాలకు ఎట్టి పరిస్థితుల్లోను వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. అలాగే, పార్టీ కీలక సమావేశాలకు బీజేపీ ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని పేర్కొన్నారు.
పార్టీ అధికార ప్రతినిధులు ఖచ్చితంగా ప్రతి మంగళవారం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో విధిగా సమావేశం కావాలనీ, పార్టీని సంప్రదించకుండా బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఏ రకమైన తీర్మానాలనూ ప్రవేశ పెట్టకూడదని కోరారు.