తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ఘజియాబాద్లో ఓ యువతికి షాన్ మహ్మద్ అనే యువకుడితో ఇటీవలే వివాహమైంది. పెళ్లి తర్వాత రక్తసంబంధీకుల ఇంటికి వెళ్లే సంప్రదాయం ప్రకారం స్థానిక షహీద్ నగర్లో ఉంటున్న ఆడపడుచు ఇంటికి భార్య, భర్త కలసి వెళ్లారు.
అయితే, బాధితురాలు నిద్రిస్తున్న సమయంలో భర్త షాన్ మహ్మద్, ఆడపడుచు రేష్మా సహకారంతో రేష్మా భర్త షంషాద్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె చేసిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులు ముగ్గురినీ అరెస్టు చేశారు.