గురువారం కూడా షర్మిల భర్తపట్ల ఆవేదన వ్యక్తం చేసింది. పలుసార్లు ఫోన్లు చేసినా ఎటువంటి స్పందనా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పలుసార్లు ఫోన్ హోల్డ్లో పెట్టేస్తున్నారని, మరికొన్ని సార్లు లిఫ్ట్ చేసి పక్కన పెట్టేస్తున్నారని జవాను సోదరుడు విజయ్ ఆరోపించాడు.
ఈ నేపథ్యంలో తన భర్త ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టినప్పటి నుంచి కనిపించడంలేదని జవాను భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తతో కనీసం ఫోన్లో అయినా మాట్లాడేందుకు అధికారులు ఒప్పుకోవడం లేదని వాపోయింది. దీంతో గురువారం ఢిల్లీ హైకోర్టులో హెబియస్ కార్పస్ కింద పిల్ను దాఖలు చేశారు. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కెకె.శర్మకు న్యాయస్థానం లీగల్ నోటీసులు పంపించనుంది.