ముహుర్త సమయం సమీపిస్తున్న తరుణంలో అమ్మాయి గురించిన నిజాలు చెప్పకుండా నిశ్చితార్థం చేశారంటూ అబ్బాయి తరపువారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన పెళ్లి కూతురి తల్లిదండ్రులు అబ్బాయితోపాటు అతని తండ్రిపై థానే పోలీసుస్టేషనులో సెక్షన్ 420 కింద కేసు పెట్టారు. దీంతో ఈ కేసులో అరెస్టు కాకుండా ముందు జాగ్రత్తగా అబ్బాయితో పాటు అతని తండ్రి ముందస్తు బెయిల్ పొందారు.
అయితే, ఈ కేసును విచారించిన థానే కోర్టు మాత్రం నిశ్చితార్థం ఖర్చుల కింద రూ.1.5 లక్షలను వధువు తల్లిదండ్రులకు చెల్లించాలని ఆదేశించింది. దీనిపై తమకూ కూడా రూ.4.5 లక్షల ఖర్చు అయిందని అబ్బాయి కుటుంబం వాదించినప్పటికీ.. కోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు.
ఆ తర్వాత కూడా వరుడు కుటుంబ సభ్యులపై వధువు తల్లిదండ్రులు పెట్టిన కేసును ఉపసంహరించుకోలేదు. దీంతో వరుడు తండ్రి బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ.. అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. చివరకు మూడేళ్లకు ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఈ కేసును విచారించిన కోర్టు.. నిశ్చితార్థం తర్వాత అమ్మాయి నచ్చలేదనో... మరో కారణమో చెప్పి పెళ్లి రద్దు చేసుకోవాలంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేసింది.