జేకీ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగేందుకు పాకిస్థాన్, హురియత్లు సహకరించాయని ముఫ్తీ సయీద్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో రగడ సృష్టించాయి. ముఫ్తీ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని కాంగ్రెస్ తదితర విపక్ష పార్టీలు పట్టుబట్టడంతో, ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగింది.
దీంతో కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్ కల్పించుకుని మాట్లాడుతూ, ముఫ్తీ మాటలు ఆయన వ్యక్తిగతమని, ప్రజల వల్లనే ఎన్నికలు విజయవంతమయ్యాయని సభకు సమాధానమిచ్చారు.ఈ విషయంలో ప్రధాని స్పందించాల్సిన అవసరం లేదని, తాను ఆయనతో మాట్లాడి వివరణ ఇస్తున్నట్టు రాజ్నాథ్ చెప్పారు. దీనిపై సంతృప్తి చెందని విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.