తమిళనాడు రాజధాని చెన్నైలో వరుణుడు ప్రతాపం చూపించాడు. వర్ష బీభత్సంతో చెన్నై సహా తమిళనాడులోని వివిధ జిల్లాల్లో వంద మందికి పైగా మృత్యువాతపడ్డారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం చెన్నై నగరాన్ని జలసంద్రంగా మార్చేసింది. నగరంలోని మెజారిటీ కాలనీలు నీట మునిగాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి దాకా క్షణం తెరిపి ఇవ్వకుండా కురిసిన వర్షం కారణంగా చెన్నై ఎయిర్ పోర్టు మూతపడింది.