వాసన రావడంతో గుర్తించిన ప్రయాణికులు విమాన సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే వారు మంటలను అదుపుచేశారు. లేదంటే పెను ప్రమాదమే సంభవించి ఉండేది. శామ్సంగ్ నోట్ ఫోన్లతో జాగ్రత్తగా ఉండాలని తాము హెచ్చరిస్తూనే ఉన్నామని, ప్రయాణంలో వారు తమ ఫోన్లను స్విచ్ఛాప్ చేయడం కానీ, లేదంటే అసలు తీసుకురాకపోవడం కానీ మంచిదని డీజీసీఏ అధికార ప్రతినిధి సూచించారు.
సింగపూర్ నుంచి చెన్నై వస్తున్న విమానంలో ఫోన్ నుంచి పొగలు, మంటలు వచ్చినట్టు ఇండిగో నిర్ధారించింది. విమానం ల్యాండ్ కావడానికి ముందు 23సీ సీట్ వద్ద ఫోన్ నుంచి పొగలు వచ్చినట్టు సిబ్బంది గుర్తించారని, వెంటనే వాటిని ఆర్పివేశారని పేర్కొంది. ఈ ఘటనపై ఆ విమానంలో ప్రయాణించే ప్రయాణింకులంతా బిత్తర పోయారు.