సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమా ప్రారంభానికి ముందే జాతీయ గీతాన్ని ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సినిమాకు ముందు జాతీయ గీతం ప్రదర్శిస్తుండగా ముగ్గురు వ్యక్తులు లేచి నిల్చునేందుకు నిరాకరించారు. దీంతో నిర్వాహకులు, ప్రేక్షకులు వారిపై దాడికి దిగారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో గతనెలలో కూడా ఓ థియేటర్లో ఇదే తరహాలో ముగ్గురిపై దాడి జరిగింది.