విద్యార్థి బుగ్గ గిల్లిన పాపానికి ఓ టీచర్కు మద్రాస్ హైకోర్టు భారీ జరిమానా విధించింది. 2012లో కేసరి హయ్యర్ సెకండరీ పాఠశాల టీచర్ మెహరున్నీసా ఓ విద్యార్థిని దండించే క్రమంలో బుగ్గ గిల్లింది. దాంతో, ఆ విద్యార్థి తల్లి ఈ ఘటనను స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళింది.
అంతేగాకుండా, సైదాపేట మేజిస్ట్రేట్ న్యాయస్థానంలోనూ ఆమె ప్రైవేట్ కేసు దాఖలు చేసింది. అటు, తనను పలు విధాలా వేధిస్తున్నారంటూ టీచర్ మెహరున్నీసా కూడా హైకోర్టును ఆశ్రయించింది.
దీనిపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు... ఈ కేసు కింది కోర్టులో పెండింగ్లో ఉందని, అక్కడకు వెళ్ళాలని సూచించింది. అంతేగాకుండా, ఆమెపై వచ్చిన ఆరోపణలన్నింటిపైనా రూ.50,000 జరిమానాగా చెల్లించాలని పేర్కొంది.