ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ప్రధాని గంటన్నరపాటు చేసిన ప్రసంగంలో జడ్జీల నియామకం అంశాన్ని ప్రస్తావిస్తారని ఎదురుచూశానని, కానీ తనకు నిరాశే మిగిలిందన్నారు. 'నేను ప్రధానికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు పేదరికాన్ని నిర్మూలించండి.. యువతకు ఉపాధి కల్పించండి.. అదేసమయంలో సామాన్యుడికి న్యాయం చేసేందుకూ ప్రయత్నించండి' అని వ్యాఖ్యానించారు.
'మీరు ఇతరులకు పండ్లు, పూలు ఇచ్చారు. మాకు మాత్రం మొండిచేతులు చూపారు. మాకూ ఏదైనా ప్రసాదించండి' అని అర్థం వచ్చే ఉర్దూ పద్యాన్ని సీజే ఠాకూర్ చదివి వినిపించారు. మరోవైపు ప్రధాని ప్రసంగంపై సుప్రీం సీజే అసంతృప్తిని వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ సహా పలు పార్టీలు స్పందించాయి. జడ్జీల నియామకంపై సీజే మాటలను ఆలకించాలని కాంగ్రెస్ కోరింది.