తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థ సేలం నగరంలోని ‘తంగంపట్టు మాలిగై’ షోరూంలో.. కో-ఆప్టెక్స్ ఎండి టీఎన్ వెంకటేశ్ పర్యావరణహిత సేంద్రియ పత్తి చీరను విడుదల చేశారు. రసాయనాలు, ఆధునిక ఎరువులు వినియోగించకుండా పండించిన పత్తితో ఈ సేంద్రియ చీరలు తయారుచేశామని ఆయన తెలిపారు.
చీరకు అద్దిన రంగులు కూడా ప్రకృతి సహజమైన పూలు, మొక్కలు, మూలికల నుంచి సేకరించినవేనని చెప్పారు. చేనేత మగ్గాలపై రూపొందించిన ఈ చీరల ఖరీదు రూ.2,750 నుంచి రూ.4 వేల మధ్య ఉంటుందన్నారు. ఇవి చాలా తేలిగ్గా ఉంటాయన్నారు. ఆన్లైన్ ద్వారా చీరల అమ్మకాన్ని కూడా కో-ఆప్టెక్స్ ప్రారంభించిందని వెంకటేశ్ తెలిపారు.