మన్మోహన్ సింగ్కు ఊరట లభించింది. బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సుప్రీం కోర్టులో స్టే ఇవ్వడంతో మన్మోహన్ సింగ్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మన్మోహన్తో పాటు మరో ఐదుగురిపై ఈ కేసులో విచారణను నిలిపివేయాలని సుప్రీం ఆదేశించింది. సీబీఐ కోర్టు జారీ చేసిన సమన్లపై ఉన్నతన్యాయస్థానం స్టే విధించింది.