బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసుకున్న అభ్యర్థనను దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మన్నించింది. బొగ్గు స్కామ్లో కోర్టుకు హాజరుకావాలంటూ తనకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటీషన్ను విచారించిన అపెక్స్ కోర్టు.. సీబీఐ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే విధించింది.