సామాజిక సైట్లతో కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య ఉన్న ఒప్పందాలను వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లతో కుదుర్చుకున్న డీల్స్ ఏంటో వాటి వివరాలను తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆయా వెబ్ సైట్లకు ఎలాంటి మేథో హక్కులున్నాయి, వాటి కోసం ఏమైనా లైసెన్స్ కలిగి ఉన్నాయా అని కోర్టు ప్రశ్నించింది.
ఢిల్లీ పోలీస్, ఇండియన్ రైల్వేస్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోషల్ మీడియా సైట్లలో ఎకౌంట్లు తెరవడాన్ని తప్పుపడుతూ బీజేపీ నేత కె.ఎన్.గోవిందాచార్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దేశంలో సేవలు అందిస్తూ ఆదాయం గడిస్తున్న వెబ్ సైట్ల నుంచి పన్నులు వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.