శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్కు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టడం పైన రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. దీనిపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. పేరు మార్పు పైన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే.. కాంగ్రెస్ పార్టీ సభ్యులు శంషాబాద్ విమానాశ్రయ డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.