మణిపూర్ ఐరన్ లేడీ, పౌర హక్కుల ఉద్యమకారిణి, ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాలకు ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్తో 14 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్ చాను షర్మిల బుధవారం పోలీసు నిర్బంధం నుంచి విడుదలయ్యారు.
సాయుధ దళాలకు ప్రత్యేక హక్కుల చట్టాన్ని అమానుషమైన చట్టంగా అభివర్ణించిన ఆమె.. ఆ చట్టం వల్ల ఎందరో మహిళలు వితంతువులయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. నిరాహార దీక్ష ద్వారా ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తోందంటూ షర్మిలపై పోలీసులు మోపిన అభియోగాన్ని కొట్టివేసిన తూర్పు ఇంఫాల్ సెషన్స్ కోర్టు.. ఆమెను విడుదల చేయాలని మంగళవారం ఆదేశించిన సంగతి తెలిసిందే.