గీతా గోపీనాథ్... ఆమె రాక కేరళ ప్రజలకు లక్... కేరళ సీఎం, మరో వివాదాస్పదం

మంగళవారం, 26 జులై 2016 (16:58 IST)
తిరువునంతపురం కేరళలో సిపిఎం ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా హార్వర్డ్ యూనివర్శిటీ ఫ్రొపెసర్ గీతా గోపీనాథ్‌ను ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ ఎంపిక చేశారు. కేరళ మూలాలు ఉన్న ఆమె సేవలను రాష్ట్రం ఉపయోగించడం తనకు సంతోషంగా ఉందని, రాష్ట్రం కోసం ఆమె కూడా సిద్ధమవడం ఆనందమని విజయన్ అన్నారు. 
 
ఆమెను ప్రశంసిస్తూ కేరళ ప్రజలు అదృష్టవంతులు అని ఆయన వ్యాఖ్యానించారు. కొందరు విమర్శకులు మాత్రం భిన్నంగా  స్పందిస్తున్నారు. సిపిఎం సైద్ధాంతిక భావజాలానికి వ్యతిరేకంగా ఆమెను నియమించారని వారు అంటున్నారు. గీత నూతన ఆర్థిక విధానాలకు అనుగుణంగా బోధిస్తుంటారని, సిపిఎం తన వైఖరులు మార్చుకుందా అని వారు ప్రశ్నిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి