జయలలిత తరుపున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ ఈ వ్యవహారంలో వాదనలు వినిపించారు. రాం జెఠ్మలానీ వాదనలు వినిపిస్తున్న సమయంలో కోర్టు బయట అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలిత సెప్టెంబర్ 27 నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.