రాజస్థాన్లోని చిత్తోడ్గఢ్లో 15-18 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు దళిత బాలలు ఒక మోటార్సైకిల్ను అపహరించుకొని దానిపై తమ గ్రామానికి వెళ్తున్న సమయంలో వారిని లక్ష్మీపుర అనే గ్రామంలో స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం వారి బట్టలు విప్పి కొట్టి నగ్నంగా ఊరేగించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు తక్షణం అక్కడికి చేరుకొని బాలలను రక్షించి పోలీస్స్టేషన్కు తరలించారని జిల్లా ఎస్పీ తెలిపారు.