యువకుడితో సన్నిహితంగా ఉంటుందని కన్నకూతురినే చంపిన తల్లి...ఎక్కడ?

మంగళవారం, 24 మే 2016 (09:16 IST)
కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన  కూతురిని కన్న తల్లి మరో ఇద్దరు బంధువులతో కలిసి హత్య చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కుర్తియా అనే గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే దళిత యువతి గ్రామంలోని ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని కోపంతో ఆమెను తల్లే పరువు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

హత్య అనంతరం యువతి మృతదేహాన్నిఆ గ్రామంలోనే ఓ గుడిసెలో గుంతతీసి పడేశారని... గ్రామస్థులు యువతి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారని ఎస్పీ మనోజ్‌ కుమార్‌ తెలిపారు. హత్యకు పాల్పడిన మృతురాలి తల్లి, ఇద్దరు బంధువులపై కేసు నమోదుచేసి విచారణ చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి