ఒక చేత్తో చప్పట్లు కొట్టలేమని సూత్రీకరించాడు. అబ్బాయిలు, అమ్మాయిలు పబ్బులు, డిస్కోలకు తిరిగితే పర్లేదా? అని ప్రశ్నించాడు. అబ్బాయిలు, అమ్మాయిలు సమానమైనప్పుడు ఉరిశిక్ష ఎందుకని అడిగాడు. అలా ఉరిశిక్షలు విధిస్తే బాధిత మహిళలకు ప్రాణహాని ఉంటుందని హెచ్చరించాడు
నిర్భయను బలాత్కరిస్తున్నప్పుడు ఆమె మౌనంగా ఉందని, ఎలాంటి ప్రతిఘటనా చేయలేదని అన్నాడు. ఆమెను తామేమీ అనలేదని, ఆమె స్నేహితుడ్ని మాత్రం చితకబాదామని తెలిపారు. నిర్భయపై అత్యాచారం చేసినప్పుడు తాను బస్సు నడుపుతున్నానని ముఖేష్ సింగ్ వివరించాడు. ఆడవాళ్లు ఇళ్లలో ఉంటే అత్యాచారం చేయాలనే ఆలోచన ఎలా వస్తుందని ఎదురు ప్రశ్నించాడు.