ఇదే జరిగితే ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వర్శిటీలకు వెళ్లి బోధిస్తానని చెప్పారు. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కేమ్ బ్రిడ్స్ యూనివర్శిటీల్లో ఇప్పటికే నాకు చాలా బోధన ఒప్పందాలున్నాయి. అవన్నీ ప్రస్తుతం ఆగిపోయాయి. బీజేపీ సభ్యురాలిగా ఉంటూనే వాటికి వెళతా. అంతేగాక నా నవ్ జ్యోతి, ఇండియా విజన్ ఫౌండేషన్ ట్రస్టుకు కూడా వెళతాను అని ఆమె వివరించారు.
కాగా, ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆమె ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా అవినీతి ఉద్యమంలో తన స్నేహితుడైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై తనదైనశైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ ముందుకుసాగిపోతున్నారు.