భార్య పుట్టింటికి వెళ్లడంతో 12 యేళ్ల కుమార్తెపై అత్యాచారం...

బుధవారం, 12 జులై 2017 (08:53 IST)
భార్య పుట్టింటికి వెళ్లంతో ఓ భర్త ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 యేళ్ల కుమార్తెపై అత్యాచారం జరిపాడు. దేశ రాజధాని నగరమైన జహంగీర్ పురిలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జహంగీర్‌పురి ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల భర్తతో అతని భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లింది. దీంతో 12 యేళ్ల కూతురు తండ్రితోనే ఇంట్లోనే ఉంది. అంతే కన్న తండ్రే భార్య లేకపోవడంతో పీకల దాకా మద్యం తాగి ఇంటికి వచ్చి కామంతో కళ్లు మూసుకుపోయి కసాయిలా మారి పన్నెండేళ్ల కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. 
 
భార్య పుట్టింటి నుంచి తిరిగి వచ్చాక కూతురు ద్వారా విషయం తెలుసుకొని భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్త పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరారైన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధిత బాలికను ఓ స్వచ్ఛంద సంస్థకు తరలించి కౌన్సెలింగ్ ఇప్పించారు. 

వెబ్దునియా పై చదవండి