పాకిస్థాన్ కళాకారులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోమారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యురీ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయంతెల్సిందే. ఈ ప్రభావం పాకిస్థాన్ కళాకారులపై కూడా పడింది. పాకిస్థాన్ కళాకారులు భారత్లో పర్యటించకుండా నిషేధం విధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.