వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్, పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడకులకు సంబంధించి శుక్రవారం మరో వివాదానికి తెరతీశారు. ములాయం సింగ్ 75వ జన్మదినాన్ని శుక్రవారం రాత్రి రాంపూర్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 75 అడుగుల భారీ కేక్ను కట్ చేశారు.