ప్రేమించి పార్కుల వెంట తిరుగుతోందని కుమార్తె - ఆమె ప్రియుడిని హత్య చేసిన తండ్రి!

ఆదివారం, 24 జులై 2016 (16:42 IST)
ఓ యువకుడిని ప్రేమించి పార్కుల వెంట తిరుగుతూ తన పరువు తీస్తుందని భావించిన ఓ తండ్రి తన కుమార్తెతో పాటు.. కుమార్తె ప్రేమించిన యువకుడిని తన కుమారుడి సాయంతో దారుణంగా హత్య చేశాడు. ఈ జంట హత్యలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌ జరిగింది. 
 
ఈ పరువు హత్య కేసు వివరాలను పరిశీలిస్తే...  చండీమల్ గ్రామానికి చెందిన 16 యేళ్ల ఇర్షాద్ అనే బాలిక ఓ యువకుడితో ప్రేమలో పడింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు నచ్చజెప్పినా ఇర్షాద్ వినలేదు. దీంతో ఇంటి పరువు పోతుందని భావించిన వారు, ఇద్దరినీ దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె తండ్రి ముఖేష్, అన్నయ్య దీపక్ లను అరెస్ట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి