ఈ పరువు హత్య కేసు వివరాలను పరిశీలిస్తే... చండీమల్ గ్రామానికి చెందిన 16 యేళ్ల ఇర్షాద్ అనే బాలిక ఓ యువకుడితో ప్రేమలో పడింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు నచ్చజెప్పినా ఇర్షాద్ వినలేదు. దీంతో ఇంటి పరువు పోతుందని భావించిన వారు, ఇద్దరినీ దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె తండ్రి ముఖేష్, అన్నయ్య దీపక్ లను అరెస్ట్ చేశారు.