అనారోగ్య సమస్యలు కేంద్ర మంత్రులను పట్టుకుని పీడిస్తున్నాయా అనే అనుమానం వస్తోంది. ఈమధ్యనే కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఐతే ఆ తర్వాత కోలుకుని విధులకు హాజరయ్యారు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో జైట్లీ చేరారనీ, ఆయన వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరారని చెపుతున్నారు.