బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి.. 14 మందికి..

శనివారం, 20 సెప్టెంబరు 2014 (14:46 IST)
లక్నోలోని ఓ బాణాసంచా కర్మాగారంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనుమతి లేకుండా నడుపుతున్న బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. 
 
ప్రమాద వార్త తెలుసుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి