బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రమాదం... ఎక్కడ?

శనివారం, 29 ఆగస్టు 2015 (09:07 IST)
దుండగులు రాజస్థాన్‌లో ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు బుల్లెట్లు తగలలేదు. ఆయన అప్రమత్తమవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. 
 
రాజస్థాన్ దౌసాలోని మహ్వా నియోజవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఓంప్రకాశ్ హుడ్లా ఏవో పనుల్లో తన ఇంట్లో ఉండగా ఓ ముగ్గురు వ్యక్తులు ఇంటి ప్రాంగణంలోకి చొరబడి కిటికిలో నుంచి కాల్పులు జరిపారు. 
 
అయితే, అదృష్టవశాత్తూ ఆయనకు ఒక్క బుల్లెట్ కూడా తగలలేదు. ఆయన వెంటనే అలారం మోగించడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి