ఈ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్లో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలకు చెందిన నలుగురు బాలికలు తాగితందనాలాడారు. వాళ్లందరూ 11వ తరగతి (జూనియర్ ఇంటర్) చదువుతున్నారు. స్నేహితురాలి పుట్టినరోజును జరుపుకోవాలని ఏడుగురు అమ్మాయిలూ పాఠశాలకు వచ్చారు.