ఫేస్బుక్లో జిందా పేరుతో ఉన్న 26 ఏళ్ల యువతితో ఓ 17 ఏళ్ల బాలుడు పరిచయం పెంచుకున్నాడు. వారిద్దరి మధ్య స్నేహం మరింతగా బలపడటంతో ఇద్దరూ ప్రత్యక్షంగా కలిసి ఏకాంతంగా (సెక్స్) గడపాలని భావించారు. ఇందుకోసం ముహూర్తం నిర్ణయించుకుని ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్లో కలిసి గదిని అద్దెకు తీసుకున్నారు.
ఆ తర్వాత వారిద్దరూ ఒక రాత్రంతా శృంగారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ యువతి పోలీసులకు ఫోన్ చేసి, తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అవాక్కైన ఆ బాలుడు... కొద్దిసేపటికి తేరుకుని మహిళపై రివర్స్లో కేసు పెట్టాడు. తనతో ఏకాంతంగా గడిపేందుకు ఆ యువతే ఆహ్వానించిందని, లైంగిక సంబంధం కోసం బలవంతం చేయడంతోనే తాను అంగీకరించానంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని పోలీసులు ఇద్దరిపైనా కేసులు పెట్టారు. బాలుడిపై అత్యాచారం కేసు, యువతిపై ‘పోస్కో’ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.